Australia Open 2023 | సిడ్నీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో గురువారం ఐదో సీడ్ సింధు 21-14, 21-10తో భారత్కే చెందిన ఆకర్షి కశ్యప్పై విజయం సాధించింది.
క్వార్టర్స్లో నాలుగో సీడ్ బివేన్ జాంగ్ (అమెరికా)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 21-10, 21-17తో లీ యాంగ్ సూ (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 19-21, 21-19, 21-13తో యూ జెన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు. యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ కూడా క్వార్టర్స్లో అడుగు పెట్టగా.. గత మ్యాచ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ను మట్టికరిపించిన మంజునాథన్కు రెండో రౌండ్లో పరాజయం ఎదురైంది.