మనీలా (ఫిలిప్పీన్స్): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకం చేజిక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాం కర్ సింధు 21-13, 19-21, 16-21తో టాప్ సీడ్ అకానే యామగుచి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. గంటకు పైగా సాగిన పోరులో తొలి గేమ్ను సునాయాసంగా చేజిక్కించుకున్న సింధు.. ఆ తర్వాత వరుస రెండు గేమ్లను కోల్పోయింది.