PV Sindhu : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu) సత్తా చాటుతోంది. పదమూడో ర్యాంకర్ అయిన ఆమె అద్భత ఆటతీరుతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. దాంతో, టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. 14 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో చైనాకు చెందిన యి మాన్ ఝాంగ్ను చిత్తు చేసింది. ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన సింధు 21-16, 13-21, 22-20తో మాన్ ఝాంగ్ను ఓడించింది.
దాంతో, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఝాంగ్ చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఆమె శనివారం జార్జియా మరిస్కా(ఇండోనేషియా)తో సింధు తలపడనుంది.
మరోవైపు తెలుగు కుర్రాడు ప్రణయ్(HS Pranay) జోరు కొనసాగిస్తున్నాడు. అతను సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 25-23, 18-21, 21-13తో కెంటా నిషిమొటో(జపాన్)ను ఓడించాడు. సెమీఫైనల్లో అతడు క్రిస్టియన్ ఆదినాథ(ఇండోనేషియా)తో తలపడనున్నాడు. మరో తెలుగు కుర్రాడు కితాంబి శ్రీకాంత్( Kidambi Srikanth) ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడు క్వార్టర్ ఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథచేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.