హైదరాబాద్: ఐపీఎల్లో సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనూ దూసుకెళ్తున్నాడు. సోషల్ మీడియా షేరింగ్ యాప్లో కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఇన్స్టాలో 250 మిలియన్ల మంది ఫాలోవర్ల మార్క్ను కోహ్లీ దాటేశాడు. 250 మిలియన్ల మంది ఇన్స్టా ఫాలోవర్లు ఉన్న ఏకైక భారతీయుడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
క్రీడాకారుల్లో ఆ స్థాయిలో ఫాలోవర్లు ఉన్న వారిలో కోహ్లీ మూడవ వ్యక్తి. క్రిస్టియానో రోనాల్డో, లియోనిల్ మెస్సి తర్వాత స్థానంలో కోహ్లీ నిలిచాడు. రోనాల్డోకు 585, మెస్సికి 464 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.