కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో .. హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. క్వార్టర్స్ ఫైనల్లో టాప్ సీడ్ ప్లేయర్ హన్ హుయిపై ఆమె విజయం సాధించింది. 21-13, 14-21, 21-12 స్కోరుతో చైనా క్రీడాకారిణిపై సింధు విక్టరీ నమోదు చేసింది. పీవీ సింధు ఇప్పటి వరకు తన కెరీర్లో 452వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత్కు చెందిన మరో షట్లర్ ఎవరూ ఇన్ని మ్యాచ్లు నెగ్గలేదు.
PV Sindhu stormed into the Women’s Singles semifinals of Malaysia Masters @Pvsindhu1 defeated top seed & world no 6 Han Yue of China by 21-13, 14-21, 21-12, in the quarterfinal pic.twitter.com/nYPaRm0Ous
— Sports India (@SportsIndia3) May 24, 2024