సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సెమీస్కు దూసుకెళ్లగా.. సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్కు నిరాశ ఎదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం మూడో సీడ్ సింధు 17-21, 21-11, 21-19తో హాన్ యూ (చైనా)పై విజయం సాధించింది. 62 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన తెలుగమ్మాయి.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్లు నెగ్గి సెమీస్లో అడుగుపెట్టింది. మరోవైపు ప్రిక్వార్టర్స్లో అద్వితీయ ఆటతీరు కనబర్చిన సైనా క్వార్టర్స్లో 13-21, 21-15, 20-22తో ఆయా ఒహోరీ (జపాన్) చేతిలో ఓడింది. 63 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సైనా కడవరకు పోరాడినా పరాజయం తప్పలేదు. పురుషుల సింగిల్స్లో ప్రణయ్, డబుల్స్లో అర్జున్-ధ్రువ్ ఓటమి పాలయ్యారు.