న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య
(బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమితురాలైంది. సింధుతో పాటు ఐరిస్ వాంగ్ (అమెరికా), రాబిన్ టబ్లింగ్ (నెదర్లాండ్స్), గ్రేసి యా పొల్లి (ఇండోనేషియా), కిమ్ సొయాంగ్ (కొరియా), జెంగ్ సి వె (చైనా)లను అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా బీడబ్ల్యూఎఫ్ సోమవారం నియమించింది. ఈ ఆరుగురి సభ్యులలోనే ఒకరు చైర్మన్గా, మరొకరు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికవుతారు. ‘కొత్తగా నియమితులైన సభ్యులు సమావేశమై బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకుంటారు’ అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. కొత్త కమిషన్ పదవీకాలం 2025 వరకు ఉంటుంది.