సయ్యద్ మోదీ ఓపెన్
లక్నో: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21-9 21-9 భారత్కే చెందిన తాన్యపై అలవోక విజయం సాధించింది. ఇండియా ఓపెన్ సెమీస్లో అనూహ్య పరాభవం ఎదుర్కొన్న సింధు ఈ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. రెండున్నరేళ్లుగా సింధుకు అంతర్జాతీయ టైటిల్ అందని ద్రాక్షగా మారింది. స్వదేశీ వేదికగా జరుగుతున్న ఈ పోరులో శుభారంభం చేసిన సింధు ప్రిక్వార్టర్స్లో లారెన్ లామ్ (అమెరికా)తో తలపడనుంది. మరో పోరులో కణిక కన్వాల్ 21-15, 16-21, 21-6తో దిషా (అమెరికా)పై నెగ్గగా.. మిక్స్డ్ డబుల్స్లో త్రిషా జాలీ-అర్జున్ జోడీ 21-8, 21-13తో భారత్కే చెందిన గౌరవ్ దేశ్వాల్- అనుభ కౌశిక్ జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్లో చిరాగ్ సేన్ 21-9, 21-6తో అన్సాల్ యాదవ్పై సునాయాసంగా గెలిచాడు. మహిళల డబుల్స్లో ఏడో సీడ్ పుల్లెల గాయత్రి-త్రిష జోడీ ముందంజ వేసింది.