BCCI | చండీగఢ్: వన్డే ప్రపంచకప్ వేదికల కేటాయింపుపై రచ్చ కొనసాగుతూనే ఉన్నది. పూర్తి ఏకపక్షంగా అహ్మదాబాద్కు కీలక మ్యాచ్లు తరలించుకుపోతూ తమను విస్మరించడంపై పంజాబ్ క్రీడామంత్రి గుర్మీత్సింగ్.. బీసీసీఐపై లేఖాస్త్రం సంధించాడు. చరిత్రాత్మక ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన మొహాలీ స్టేడియాన్ని వేదికల నుంచి తప్పించడంపై బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షాను లక్ష్యంగా చేసుకుంటూ గుర్మీత్ ప్రశ్నలు సంధించాడు.
అసలు మొహాలీని ఏ ప్రాతిపాదికగా విస్మరించారంటూ బీసీసీఐ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాడు. సరైన వసతి సౌకర్యాలు లేని కారణంగా మొహాలీని ఎంపిక చేయలేదన్న బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్శుక్లా వ్యాఖ్యలను గుర్మీత్ ఖండించాడు.