ఐపీఎల్ 14 సీజన్లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్.. బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఇది 32 వ మ్యాచ్.
పంజాబ్ కింగ్స్ టీమ్ నుంచి కేఎల్ రాహుల్, అగర్వాల్, పూరన్, మార్కరమ్, హూడా, అలెన్, పోరెల్, బ్రార్, షమీ, రషిద్, సింగ్ ఆటగాళ్లు బరిలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి లెవిస్, జైస్వాల్, సామ్సన్, లామ్రోర్, లివింగ్స్టన్, పరాగ్, తెవాటియా, మోరిస్, త్యాగి, సకారియా, రహ్మాన్ బరిలో ఉన్నారు.
ఇక.. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు లెవిస్, జైస్వాల్ బ్యాటింగ్కు దిగారు. 5 ఓవర్లు ముగిసేసరికి.. రాజస్థాన్ రాయల్స్ 53 పరుగులు చేసింది. లెవిస్ 21 బంతుల్లో 36 రన్స్ చేసి ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ప్రస్తుతం క్రీజ్లో జైస్వాల్, సామ్సన్ ఉన్నారు. పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. అగర్వాల్.. క్యాచ్ పట్టడంతో లెవిస్ ఔటయ్యాడు.