ఐపీఎల్లో వావ్ అనే ప్రదర్శన. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. పెట్టని కోట లాంటి వాంఖడే మైదానంలో తిరుగులేని ముంబై ఆధిపత్యానికి పంజాబ్ గండికొట్టింది. ఆరేండ్లుగా ఎదురుచూస్తున్న విజయాన్ని అక్కున చేర్చుకుంది. సామ్ కరన్, హర్ప్రీత్, జితేశ్ సూపర్ బ్యాటింగ్తో భారీ స్కోరు అందుకున్న పంజాబ్.. ముంబైకి కళ్లెం వేసింది. గ్రీన్, సూర్యకుమార్, రోహిత్శర్మ బ్యాట్లు ఝులిపించినా..అర్ష్దీప్సింగ్ అద్భుత బౌలింగ్తో పంజాబ్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి ఓవర్లో తిలక్వర్మ, నేహాల్ వదేరా వికెట్లను పగులగొట్టిన సింగ్..పంజాబ్ కింగ్గా నిలిచాడు. ముంబై: వావ్ వార్వెవా ఏం మ్యాచ్. పరుగుల వరద పారిన మ్యాచ్లో ముంబైపై పంజాబ్ కింగ్స్దే పైచేయి అయ్యింది.
శనివారం జరిగిన రెండో మ్యాచ్లో పంజాబ్ 13 పరుగుల తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ గైర్హాజరీలో సామ్ కరన్ జట్టును ముందుండి నడిపించాడు. ముంబై కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ పంజాబ్ ‘కింగ్స్’ అనిపించుకుంది. మొత్తంగా ఆరేండ్ల తర్వాత వాంఖడేలో పంజాబ్ తొలి విజయాన్ని ముద్డాడింది. తొలుత సామ్ కరాన్(29 బంతుల్లో 55, 5ఫోర్లు, 4 సిక్స్లు), హర్ప్రీత్సింగ్(28 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్స్లు) , జితేశ్శర్మ(7 బంతుల్లో 25, 4 సిక్స్లు) ధనాధన్ బ్యాటింగ్తో20 ఓవర్లలో 214/8 స్కోరు చేసింది. పీయూష్ చావ్లా(2/15), గ్రీన్(2/41) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 201/6 స్కోరుకు పరిమితమైంది. గ్రీన్(67), సూర్యకుమార్ యాదవ్(57), రోహిత్శర్మ(44) రాణించారు. అర్ష్దీప్సింగ్(4/29) నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, ఎలిస్, లివింగ్స్టోన్ ఒక్కో వికెట్ తీశారు. కరన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
స్కోరుబోర్డు
పంజాబ్: 20 ఓవర్లలో 214/8(కరన్ 55, హర్ప్రీత్సింగ్ 41, పీయూష్ 2/15, గ్రీన్ 2/41),
ముంబై: 20 ఓవర్లలో 201/6(గ్రీన్ 67, సూర్యకుమార్ 57, అర్ష్దీప్సింగ్ 4/29, లివింగ్స్టోన్ 1/23)