ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంబాబ్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఎదుట పెట్టింది. లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై బ్యాటర్లలో డివాల్డ్ బ్రీవీస్(49), సూర్యకుమార్ యాదవ్(43), తిలక్ వర్మ(36) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా బ్రీవీస్ (49 – 25 బంతుల్లో 4×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్(43) కీలక సమయంలో పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లు కీలకమైన సమయంలో ముంబై బ్యాటర్లు కట్టడి చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కఠంగా మారింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ (3), కీరన్ పొలార్డ్ (10), జయదేవ్ ఉనద్కత్ (12) బ్యాటింగ్లో విఫలమయ్యారు. డకౌటయ్యాడు. ఆఖరు బంతికి టైమల్ మిల్స్ (0) క్యాచ్, అంతకు ముందు బుమ్రా (0) డకౌటయ్యారు. చివర్లో మురుగన్ అశ్విన్ (0) నాటౌట్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ఓడీన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ రెండు వికెట్లు, వైభవ్ అరోరా ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంబాబ్కు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. నిలకడగా ఆడుతూ సిక్స్లు, ఫోర్లతో చెలరేగారు. ముఖ్యంగా మయాంక్ తన ట్రేడ్ మార్క షాట్లతో కనువిందు చేశాడు. కేవలం 32 బంతుల్లో 52 పరుగులు(6 ఫోర్లు, 2 సిక్స్లు) బాది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ధావన్ (50 బంతుల్లో 70) కూడా ధాటిగా ఆడాడు. పంజాబ్ స్కోరు 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు మయాంక్ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన బెయిర్ స్టో(12), లివింగ్ స్టోన్(2) నిరాశ పరిచినా జితీశ్ శర్మ(15 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షారుక్(15) కూడా పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బాసిల్ థంపి 2 వికెట్లు, మురుగన్ అశ్విన్ ఒక వికెట్, బుమ్రా ఒక వికెట్, జైదేవ్ ఉనాద్కత్ ఒక వికెట్ తీశారు.