న్యూఢిల్లీ: ఐపీఎల్ (IPL) సరికొత్త సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ను (Mayank Agarwal) జట్టు సారధిగా నియమించింది. ఈ ఏడాది పంజాబ్ జట్టును మయాంక్ అగర్వాల్ ముందుండి నడిపిస్తాడని జట్టు యాజమాన్యం ట్విటర్ వేదికగా ప్రకటించింది. మార్చి 26 నుంచి ఐపీఎస్ 2022 సీజన్ ప్రారంభంకానుంది.
మయాంక్ అగర్వాల్.. 2018 నుంచి పంజాబ్ జట్టుకి ఆడుతున్నాడు. గతేడాదివరకు కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడు అందుబాటులో లేని సమయంలో కెప్టెన్గా కొన్ని మ్యాచ్ల్లో జట్టు నడిపించాడు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ వేలానికి ముందే మయాంక్ను పంజాబ్ జట్టు రూ.14 కోట్లకి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
‘2018 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాను. ఈ అద్భుతమైన యూనిట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు అనందంగా ఉందని’ మయాంక్ అగర్వాల్ అన్నాడు.