అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు సారథి కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు రాహుల్ తెలిపాడు. మెరెడిత్, ప్రభు సిమ్రాన్, హర్ప్రీత్లను తుది జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు.
ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఐదింట్లో గెలుపొంది
పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఆరు మ్యాచ్లాడిన పంజాబ్ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. సీజన్లో ఇరుజట్లు తలపడటం ఇదే మొదటిసారి. బెంగళూరు మరో విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది. తడబడుతున్న పంజాబ్ మళ్లీ గెలుపుబాట పట్టాలని పట్టుదలతో ఉంది.