న్యూఢిల్లీ: పరుగుల రాణి పీటీ ఉషా.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలిగా ఎంపికైంది. తద్వారా ఈ గౌరవం దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్లో ఎన్నో ఘనతలు సాధించిన పీటీ ఉషా.. ఐవోఏ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్ష పదవికి ఒక్కరే పోటీ చేయడంతో సుప్రీం కోర్టు నియమించిన రిటైర్డ్ జడ్జీ ఎల్ నాగేశ్వరరావు.. ఆమెను అధ్యక్షురాలిగా ప్రకటించారు.
ఈ నెల లోపు ఎన్నికలు నిర్వహించకుంటే.. ఐవోఏపై సస్పెన్షన్ విధిస్తామని.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) హెచ్చరించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించారు. హైదరాబాదీ ఏస్ షూటర్ గగన్ నారంగ్ ఐవోఏ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా పీటీ ఉషా మాట్లాడుతూ.. ‘ఐవోఏ అధ్యక్ష బాధ్యతలు చేపడుతానని నేనెప్పుడూ ఊహించలేదు. చిన్నప్పటి నుంచి నా జీవితం క్రీడలకే అంకితం చేశా. యుక్త వయసులో అథ్లెట్గా.. ఆ తర్వాత కోచ్గా.. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్గా.. ఇలా సాగిపోతున్నా. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని పేర్కొంది.