నార్తాంప్టన్: రానున్న ఇంగ్లండ్ కౌంటీ సీజన్లోనూ టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషా..నార్తాంప్టన్షైర్ జట్టుతోనే కలిసి కొనసాగనున్నాడు. మోకాలి గాయం కారణంగా ప్రస్తుత సీజన్ మధ్యలోనే నిష్క్రమించిన పృథ్వీ.. కౌంటీల్లో తిరిగి ఆడేందుకు మొగ్గుచూపాడు.
దీనిపై స్పందిస్తూ ‘వచ్చే సమ్మర్ సీజన్లో నార్తాంప్టన్షైర్ తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గాయంతో సీజన్ మధ్యలోనే వెనుతిరగడం ఒకింత ఇబ్బంది కల్గించినా.. క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది. జట్టుకు మరిన్ని విజయాలు అందించడమే నా లక్ష్యం. వచ్చే సీజన్లో కౌంటీ చాంపియన్షిప్తో పాటు వన్డే కప్ టోర్నీకి అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు.