నార్తంప్టన్షైర్: భారత యువ క్రికెటర్ పృథ్వీషా మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. వన్డే కప్లో భాగంగా సోమర్సెట్తో బుధవారం జరిగిన మ్యాచ్లో నార్తంప్టన్షైర్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ(153 బంతుల్లో 244, 28ఫోర్లు, 11సిక్స్లు) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు.
సోమర్సెట్ బౌలర్లను చితకబాదుతూ షా ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 81 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న ఈ యువ బ్యాటర్ 129 బంతుల్లో ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు.