లండన్: ఫుట్బాల్లో ఓ రెబల్ లీగ్ ప్రారంభం కాబోతోంది. దాని పేరు యురోపియన్ సూపర్ లీగ్ (ఈఎస్ఎల్). యురోపియన్ ఫుట్బాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ.. ఆరు ప్రధాన క్లబ్లు ఈ సూపర్ లీగ్కు సై అనడం ఫిఫా, యూఈఎఫ్ఏలకు మింగుడు పడటం లేదు. ఆర్సెనెల్, చెల్సీ, లివర్పూల్, మాంచెస్టర్ సిటీ, మాంచెస్టర్ యునైటెడ్, టోటెన్హామ్ క్లబ్లు ఈ యురోపియన్ సూపర్ లీగ్లో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాయి.
ఇప్పటికే దీనికి ఓకే చెప్పిన ఏసీ మిలాన్, అట్లెటికో మాడ్రిడ్, బార్సిలోనా, ఇంటర్ మిలాన్, జువెంటస్, రియల్ మాడ్రిడ్ టీమ్స్తో ఇవి చేరనున్నాయి. దీంతో ఈ లీగ్లో టీమ్స్ సంఖ్య 12కు చేరంది. వీటికి తోడు మరో మూడు టీమ్స్ కూడా ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ 15 టీమ్స్ ప్రతి ఏటా ఈ లీగ్లో తలపడనుండగా.. మరో ఐదు టీమ్స్ క్వాలిఫై అయి ఆడాల్సి ఉంటుంది.
ఈ టీమ్స్ తమ నేషనల్ లీగ్స్లో ఆడుతూనే వారం మధ్యలో ఆడటానికి సిద్ధపడినట్లు ఈఎస్ఎల్ వెల్లడించింది. సాధ్యమైనంత త్వరగా ఈ లీగ్ను ప్రారంభించనున్నట్లు చెప్పింది. మహిళల టోర్నీని కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
ఫిఫా హెచ్చరికలు
అయితే ఈ లీగ్ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తోపాటు ఫిఫా, యూఈఎఫ్ఏ, ప్రీమియర్ లీగ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ లీగ్ ముందుకు వెళ్లకుండా ఏం చేయాలో అన్నీ చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పడం గమనార్హం. దేశంలోని ఫుట్బాల్ అభిమానులు, ఈ దేశ ఫుట్బాల్కు ఇది మంచి విషయం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం డబ్బు కోసమే ఆడుతున్న లీగ్ అని, ఇది ఫుట్బాల్ సమగ్రతను దెబ్బ తీస్తుందని విమర్శకులు అంటున్నారు.
ఈ లీగ్ను తాము గుర్తించబోమని ఫిఫా ఇప్పటికే ప్రకటించింది. ఇందులో ఆడే ప్లేయర్స్ను వరల్డ్కప్లో ఆడనివ్వమనీ హెచ్చరించింది. అటు యురోపియన్ ఫుల్బాల్కు చెందిన యూఈఎఫ్ఏ కూడా ఇందులో ఆడే ప్లేయర్స్ మరెందులోనూ ఆడకుండా నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది. ఈ లీగ్ విషయమై అటు ఫిఫా, ఇటు ఈఎస్ఎల్ మధ్య న్యాయ పోరాటం కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది.
రెమ్డెసివిర్ మంత్రదండం కాదు.. స్టెరాయిడ్స్ పని చేస్తాయి: ఎయిమ్స్ చీఫ్
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
గుడ్న్యూస్.. నోటి ద్వారా ఇచ్చే రెమ్డెసివిర్ అభివృద్ధి చేసిన జుబిలంట్ ఫార్మా
మీ హోదాకు ఇది తగదు.. మన్మోహన్కు హర్షవర్ధన్ కౌంటర్
IPL 2021: రషీద్ఖాన్తో కలిసి ఉపవాసం చేసిన వార్నర్, విలియమ్సన్
టార్గెట్ టీ20 వరల్డ్కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ