బెంగళూరు: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు స్టాండ్బై ఆటగాడిగా ఎంపికైన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ముగియడంతో బెంగళూరు చేరిన కృష్ణ శనివారం మరోసారి పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. లీగ్లో కోల్కతాకు ఆడిన ప్రసిద్ధ్ కృష్ణకు.. చక్రవర్తి, సందీప్ నుంచి వైరస్ సోకి ఉంటుందని ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపారు.