న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఇండియా ఓపెన్ క్వార్టర్ఫైనల్లో ప్రవేశించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో గురువారం ప్రణయ్ 20-22, 21-14, 21-14తో భారత్కే చెందిన ప్రియాన్షు రజావత్పై విజయం సాధించాడు. 76 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్కు ప్రియాన్షు గట్టి పోటీ నిచ్చాడు. పురుషుల డబుల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సాత్విక్-చిరాగ్ జోడీ 21-14, 21-15తో లూ చింగ్-యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది.