న్యూఢిల్లీ: డెవిస్ కప్లో భారత్కు శుభారంభం దక్కలేదు. ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గ్రూప్-1 తొలి రౌండ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 3-6, 6-7 (1/7)తో ప్రపంచ 419వ ర్యాంకర్ ఒట్టో విర్టానెన్ (ఫిన్లాండ్) చేతిలో ఓడాడు. గంటా 25 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో ప్రజ్నేశ్ తనకంటే తక్కువ ర్యాంకర్పై ఆధిపత్యం కనబర్చలేక వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు.