Praggnanandhaa | న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి సంచలనం నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో 18 ఏండ్ల ప్రజ్ఞానంద భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను వెనక్కి నెట్టి భారత నంబర్వన్గా అవతరించాడు. తాజా ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో ప్రపంచంలో 11వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 2748 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నా డు.
బుధవారం జరిగిన పోరులో నల్లపావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద 62 ఎత్తుల్లో ప్రపంచ చాంపియన్పై గెలుపొందాడు. దీంతో క్లాసిక్ విభాగంలో ఆనంద్ తర్వాత ప్రపంచ చాంపియన్ను ఓడించిన రెండో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ చాంపియన్పై గెలవడం చాలా ఆనందంగా ఉందని.. ఈ విజయ పరంపరను కొనసాగించాలనుకుంటున్నట్లు ప్రజ్ఞానంద తెలిపాడు.