IPL 2023 : ప్లే ఆఫ్స్ పోటీలో వెనకబడిన పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్లో సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్పై 31 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(103) శతకం బాదడంతో 167 రన్స్ కొట్టింది. లక్ష్య ఛేదనలో హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ స్పిన్ ధాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(54) తప్ప ఏ ఒక్కరూ కనీస పోరాటం చేయలేదు. ఆరో విజయంలో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింది. ప్లే ఆఫ్స్ పోటీలో తాము ఉన్నామంటూ మిగతా జట్టకు హెచ్చరికలు పంపింది.
కీలక మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(103) సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో వంద పరుగులు కొట్టాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమైన చోట అతను సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. దాంతో, పంజాబ్ పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టార్గెట్ ఏమంత పెద్దది కాదు. కానీ, ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(54) ఒక్కడే రాణించాడు. ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(21), మిచెల్ మార్ష్(3), రిలే రస్సో(5), అక్షర్ పటేల్(1), ఇంపాక్ట్ ప్లేయర్ మనీశ్ పాండే(0) విఫలమయ్యారు. హర్ప్రీత్ బ్రార్ 4 వికెట్లతో ఢిల్లీని దెబ్బకొట్టాడు.
The @PunjabKingsIPL are on 🔥🔥
Harpreet Brar has 4️⃣ and #DC are 6 down in the chase 🤯
Follow the match ▶️ https://t.co/bCb6q4bzdn #TATAIPL | #DCvPBKS pic.twitter.com/WmJhwFTAJz
— IndianPremierLeague (@IPL) May 13, 2023
ప్రభ్సిమ్రాన్ సింగ్(103)
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే శిఖర్ ధావన్(7) ఔటయ్యాడు. ఇషాంత్ తన రెండో ఓవర్లో లివింగ్స్టోన్(4)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, జితేశ్ శర్మ(5)ను బౌల్డ్ చేశాడు. దాంతో, పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ప్రభ్సిమ్రాన్, సామ్కరన్ పంజాబ్ను ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన ప్రభ్సిమ్రాన్ ఐపీఎల్లో తొలి సెంచరీ బాదాడు. అతడు ఔటయ్యాక సికిందర్ రజా (11 నాటౌట్) పంజాబ్ స్కోర్ 160 దాటించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు.