IPL 2023 : కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(103) సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో వంద పరుగులు కొట్టాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమైన చోట అతను సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. దాంతో, పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే శిఖర్ ధావన్(7) ఔటయ్యాడు. ఇషాంత్ తన రెండో ఓవర్లో లివింగ్స్టోన్(4)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, జితేశ్ శర్మ(5)ను బౌల్డ్ చేశాడు. దాంతో, పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ప్రభ్సిమ్రాన్, సామ్కరన్ పంజాబ్ను ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన ప్రభ్సిమ్రాన్ ఐపీఎల్లో తొలి సెంచరీ బాదాడు. అతడు ఔటయ్యాక సికిందర్ రజా (11 నాటౌట్) పంజాబ్ స్కోర్ 160 దాటించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు.
𝗠𝗮𝗶𝗱𝗲𝗻 𝗜𝗣𝗟 𝗖𝗲𝗻𝘁𝘂𝗿𝘆 𝗳𝗼𝗿 𝗣𝗿𝗮𝗯𝗵𝘀𝗶𝗺𝗿𝗮𝗻 𝗦𝗶𝗻𝗴𝗵!
A sensational knock this from the @PunjabKingsIPL batter 🙌#TATAIPL | #DCvPBKS pic.twitter.com/lf8RICIOf1
— IndianPremierLeague (@IPL) May 13, 2023