పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ చరిత్ర సృష్టించింది. ఇండియన్ వెల్స్ ఫైనల్స్లో గ్రీస్కు చెందిన మరియా సక్కరిపై ఘనవిజయం సాధించి, ప్రపంచ నెంబర్ 2 ర్యాంకు సాధించింది. కాలిఫోర్నియాలో బలమైన గాలుల మధ్య జరిగిన ఇండియన్ వెల్స్ ఫైనల్స్ మ్యాచ్లో 6-4, 6-1 తేడాతో మరియాపై స్వియాటెక్ విజయం సాధించింది.
20 ఏళ్ల స్వియాటెక్ ఈ మ్యాచ్లో మొత్తం ఆరు సర్వీస్ బ్రేక్స్ సాధించింది. దీంతో ఆమె ఖాతాలో మరో డబ్ల్యూటీఏ 1000 టైటిల్ చేరింది. 2020లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన స్వియాటెక్ కెరీర్లో ఇది ఐదో టైటిల్ కావడం విశేషం. ఫిబ్రవరి నెలలో దోహా వేదికగా జరిగిన డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్ విజేతగా నిలిచిన స్వియాటెక్..
‘‘నేను ఈ టోర్నీ ఫైనల్స్ చేరతానని అస్సలు ఊహించలేదు. దోహాలో రాణించాను కానీ.. ఆ ఫామ్ ఇంత కాలం కొనసాగుతుందని అనుకోలేదు’’ అని చెప్పింది. అంతేకాదు, పరిస్థితుల కారణంగా ఈ మ్యాచ్ చాలా కొత్తగా అనిపించిందని వెల్లడించింది. ఈ విజయంతో ఆమె డబ్ల్యూటీఏ మ్యాన్ విన్నింగ్ స్ట్రీక్ 11కు చేరింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో కూడా రెండో స్థానానికి చేరింది.