అహ్మాదాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు ఓడిన తర్వాత.. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్కు ప్రధాని మోదీ(PM Modi) వెళ్లారు. క్రికెటర్లలో మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భుజాలపై చేయి వేసిన మోదీ వారితో ముచ్చటించారు. ఇలాంటివి జరుగుతుంటాయని, మనోధైర్యాన్ని కోల్పోవద్దు అన్న సందేశాన్ని ఇచ్చారు.
వరుసగా 10 మ్యాచ్లను గెలిచారని, మిమ్మల్ని కలవాలనిపించిందని, ఒక్క మ్యాచ్ ఓడిపోవడం సహజమే అని, మీరు నవ్వుతూ ఉండాలని, దేశం మిమ్మల్ని చూస్తోందని మోదీ అన్నారు. జడేజాతో మాట్లాడుతూ క్యా బాబూ అని పిలిచిన ప్రధాని.. నువ్వేదైనా గుజరాతీలో మాట్లాడు అని పేర్కొన్నారు. ఇక ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ షమీని కూడా మోదీ ఓదార్చారు. షమీ బాబు.. ఈసారి చాలా బాగా ఆడావని అతనికి కితాబు ఇచ్చారు. షమీని దగ్గరకు తీసుకుని చేయి వేశారు. బుమ్రాతోనూ మాట్లాడుతూ నీకు గుజరాతీ వచ్చు కాదా అని అన్నారు.
టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని, అందరు ఒక్కటి ఉండాలని, ఒకర్ని ఒకరు ప్రోత్సహించుకోవాలని, ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే, మనం ఢిల్లీలో ఓసారి కలుసుకుందాం అని ప్రధాని అన్నారు. ఢిల్లీకి రావాలంటూ క్రికెట్కు మోదీ ఆహ్వానం పలికారు.
VIDEO | When PM Modi met Team India cricketers in their dressing room after the Indian side lost the #ICCWorldCup2023 final against Australia on Sunday. pic.twitter.com/4BV9hfs40G
— Press Trust of India (@PTI_News) November 21, 2023