న్యూఢిల్లీ: డెఫ్లింపిక్స్లో 16 పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. బ్రెజిల్ వేదికగా ఇటీవల జరిగిన టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లతో శనివారం ప్రధాని తన నివాసం భేటీ అయ్యారు. వారి అనుభవాలు తెలుసుకుని అభినందనలు తెలిపారు.
‘డెఫ్లింపిక్స్లో భారత్కు గర్వకారణంగా నిలిచిన చాంపియన్లతో జరిపిన సంభాషణ నేను ఎప్పటికీ మరువలేను. కొందరు అథ్లెట్లు చెప్పిన అనుభవాలు వింటుంటే వారు ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థమైంది. అందరికీ నా శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పోటీల్లో తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ దేశానికి తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే.