న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ కీర్తించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జరిగిన వేడుకలకు హాజరైన ఒలింపిక్ ఆటగాళ్ల బృందాన్ని మోదీ ప్రశంసించారు. మోదీ మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్లో మన యువ ఆటగాళ్లు దేశం గర్వించేలా చేశారు. వారంతా ఈరోజు ఇక్కడ ఉన్నారు. అథ్లెట్లంతా దేశ ప్రజల ప్రేమను గెలవడమే కాదు.. యువతకు స్ఫూర్తిగా నిలిచారు’ అని అన్నారు.