హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్తో చాలా మంది క్రీడాకారుల కెరీర్లు దెబ్బతిన్నాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. కొవిడ్-19 విజృంభణ, ప్లేయర్ల కెరీర్పై వైరస్ చూపిన ప్రభావం తదితర అంశాలపై ఆయన మాట్లాడాడు. శనివారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపీచంద్ మాట్లాడుతూ ‘కరోనా మహమ్మారితో ప్లేయర్ల స్వల్పకాలిక కెరీర్లు కుదుపునకు లోనయ్యాయి. కానీ క్రీడాకారులకు జీవితాలో గెలుపోటములు, ఎత్తుపల్లాలు సాధారణం కాబట్టి అధిగమించగలిగారు’ అని అన్నాడు.