న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ప్రతి సెషన్లో మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చెప్పాడు. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను ఇంగ్లిష్ గడ్డపై టీమ్ఇండియా ఆడనుంది. ఈ టూర్కు వెళ్లేందుకు ముంబైలో జట్టుతో పాటు గిల్ 14 రోజుల క్వారంటైన్లో ఉన్నాడు.