అహ్మదాబాద్ : అర్జున్ దేశ్వాల్, కెప్టెన్ అస్లామ్ ఇనామ్దార్ ప్రతిభతో సోమవారం జరిగిన ప్రొ కబడ్డీ మ్యాచ్లో పుణెరి పల్టన్ 37-33 స్కోరుతో గత చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ను మట్టికరపించింది. అర్జున్ 17 పాయింట్లు, అస్లామ్ 10 పాయింట్లు సాధించారు.
ఆరంభంలో జైపూర్ జట్టు ఆధిక్యంలో నిలిచినా, తరువాత అభినేష్ నటరాజన్, అజిత్కుమార్ పాయింట్లు కొల్లగొట్టడంతో పుణెరి జట్టు 14-10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పలుమార్లు ఆధిక్యం చేతులు మారిన మ్యాచ్లో చివరి నిమిషాలలో అర్జున్ విజృంభణతో జైపూర్కు విజయం దక్కింది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32-30 తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. బెంగాల్ జట్టులో మనిందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు సాధించగా, బెంగళూరు జట్టులో భరత్(6) టాప్ స్కోరర్.