ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ తడబడుతోంది. భారీ షాట్లు ఆడిన జానీ బెయిర్స్టో (28) త్వరగానే అవుటయ్యాడు. ఆ తర్వాతవ వచ్చిన రాజపక్స (4)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. ఠాకూర్ వేసిన బంతిని మిడ్వికెట్ మీదుగా కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని మిస్ అవడంతో.. బ్యాక్వర్డ్ పాయింట్ వైపు వెళ్లింది. దాన్ని నోర్ట్జీ అందుకోవడంతో రాజపక్స మైదానం వీడాడు.
అదే ఓవర్ చివరి బంతికి ధవన్ (19) కూడా పెవిలియన్ చేరాడు. రూమ్ తీసుకొని బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించిన ధవన్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని పంత్ అందుకున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి పంజాబ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.