ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్గా మారిన తర్వాత అద్భుతంగా రాణిస్తున్న జానీ బెయిర్స్టో (28) అవుటయ్యాడు. నోర్ట్జీ వేసిన నాలుగో ఓవర్లో షార్ట్ బాల్ను ఆడే క్రమంలో బెయిర్స్టో పెవిలియన్ చేరాడు. 152 కిలోమీటర్ల వేగంతో నోర్ట్జీ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో.. డీప్ స్క్వేర్ లెగ్లో అక్షర్ పటేల్కు చిక్కాడు. దాంతో 38 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది.