ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లూ ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సోమవారం నాడు కీలకమైన పోరుకు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సారధి మయాంక్ అగర్వాల్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని తెలిపాడు. ఢిల్లీ జట్టులో లీడింగ్ వికెట్ టేకర్ అయిన ఖలీల్ అహ్మద్ తిరిగి వచ్చాడని, చేతన్ సకారియా స్థానంలో అతను ఆడుతున్నాడని పంత్ వెల్లడించాడు. అలాగే కేఎస్ భరత్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ను తీసుకున్నట్లు చెప్పాడు.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, రావ్మెన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్ట్జీ, ఖలీల్ అహ్మద్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టన్, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ, రిషి ధావన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
#PBKS have won the toss and they will bowl first against #DelhiCapitals
Live – https://t.co/twuPEouUzK #PBKSvDC #TATAIPL pic.twitter.com/MQSAmcr4o0
— IndianPremierLeague (@IPL) May 16, 2022