పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. డేవిడ్ వార్నర్ (0) తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 32) చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలతో విజృంభించాడు. అయితే అతన్ని ఐదో ఓవర్లో అర్షదీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. అర్షదీప్ వేసిన స్లో బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన సర్ఫరాజ్.. మిడాన్లో చాహర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో లలిత్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. పవర్ప్లే ముగిసే సరికి ఢిల్లీ జట్టు 2 వికెట్ల నష్టానికి 59 పరుగులతో నిలిచింది.