మయాంక్ అగర్వాల్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.. నెమ్మదిగా కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటూ జట్టును విజయాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో పంజాబ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ ఎంచుకున్నట్లు ప్రకటించాడు. తర్వాత మంచు వస్తుందో లేదో తెలియదని, కానీ వస్తుందనే తాము భావిస్తున్నామని జడ్డూ అన్నాడు.
అలాగే చెన్నై జట్టులో ఎలాంటి మార్పులూ లేవని చెప్పాడు. ఇప్పటి వరకూ ఏడుసార్లు టాస్ వేస్తే ఆరుసార్లు ఓడిపోయిన మయాంక్.. ఈ విషయంలో తానేమీ చేయలేనంటూ నవ్వేశాడు. జట్టులో మూడు మార్పులు చేసినట్లు చెప్పాడు. షారుఖ్ ఖాన్, నాథన్ ఎలిస్, వైభవ్ అరోనా ముగ్గురూ ఆడటం లేదన్నాడు. వారి స్థానాల్లో సందీప్ శర్మ, రిషి ధావన్, భానుక రాజపక్స ఆడుతున్నట్లు వెల్లడించాడు.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, మిషెల్ శాంట్నర్, డ్వెయిన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, ముకేష్ చైదరి, మహీష్ తీక్షణ
A look at the Playing XI for #PBKSvCSK
Live – https://t.co/V5jQHQZNn0 #PBKSvCSK #TATAIPL https://t.co/0QEYxPDVQg pic.twitter.com/MLMfPULxde
— IndianPremierLeague (@IPL) April 25, 2022