హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరెట్స్ ఎనిమిదోసారి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ ఎలిమినేటర్-1 మ్యాచ్లో పట్నా 37-35 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో పుణెరీ పల్టన్స్తో పట్నా తలపడనుంది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఢిల్లీ 20-19తో స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. సెకండ్ హాఫ్లో విజృంభించిన పట్నా ముందంజ వేసింది. పట్నా తరఫున అత్యధికంగా సచిన్ 9 పాయింట్లు సాధించాడు. ఢిల్లీ తరఫున ఆషు మాలిక్ 19 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మరో ఎలిమినేటర్లో హర్యానా స్టీలర్స్ 42-25తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. రెండో సెమీస్లో జైపూర్ పింక్ పాంథర్స్తో హర్యానా అమీతుమీ తేల్చుకోనుంది.