బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరెట్స్ దుమ్మురేపుతున్నది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 52-24తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. పట్నా తరఫున మోను గోయత్ (9), ప్రశాంత్ (8), సచిన్ (6), నీరజ్ (6), షాద్లొయ్ (6) రాణించారు. తలైవాస్ నుంచి సాగర్ (8) ఫర్వాలేదనిపించాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లాడిన పట్నా 8 విజయాలు.. మూడు పరాజయాలతో 45 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. సీజన్ ఆరంభం నుంచి చక్కటి ప్రదర్శన కొనసాగిస్తున్న బెంగళూరు బుల్స్ (46 పాయింట్లు) టాప్లో ఉండగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ 14 మ్యాచ్లాడి ఒక విజయం మాత్రమే సాధించి అట్టడుగున కొనసాగుతున్నది. శనివారం జరుగనున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్తో దబంగ్ ఢిల్లీ తలపడనుంది.