IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఫైనల్ ఫైట్కు సండేతో తెరలేనుంది. రికార్డు స్కోర్లతో, ఉత్కంఠ పోరాటాలతో, ఆఖరి ఓవర్ థ్రిల్లర్స్తో రంజుగా సాగిన ఈ మోగా టోర్నీ చాంపియన్ ఎవరో చెపాక్లో తెలిసిపోనుంది. టైటిల్ పోరుకు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins), కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)లు ఫొటోషూట్లో పాల్గొన్నారు.
చెన్నైలోని మెరీనా బీచ్లో.. ఇసుకతిన్నెల్లో ఉన్న పడవ మీద ఇద్దరూ కూర్చొని ఐపీఎల్ ట్రోఫీతో సందడి చేశారు. ఆ ఫొటోలను ఐపీఎల్ నిర్వాహకలు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Two Captains. One Trophy 🏆
..And an eventful Chennai evening 🛺🏖️
All eyes on the #Final 😎#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/5i0nfuWTGN
— IndianPremierLeague (@IPL) May 25, 2024
We added some Marina Magic to the Pre-Final photoshoot! 😎
A Saturday seaside 🌊 spotlight with the 2⃣ captains 💜 🧡#TATAIPL | #TheFinalCall | #Final | #KKRvSRH | @KKRiders | @SunRisers | @ShreyasIyer15 | @patcummins30 pic.twitter.com/1lyr8ZKb2j
— IndianPremierLeague (@IPL) May 25, 2024
పదిహేడో సీజన్లో సన్రైజర్స్, కోల్కతా ప్రస్థానం భిన్నంగా సాగింది. కోల్కతా జట్టు నిలకడగా రాణిస్తూ 9 విజయాలో టేబుల్ టాపర్గా నిలిచింది. మరోవైపు కమిన్స్ సేన ఆదిలో 275, 287 రన్స్తో ఐపీఎల్ చరిత్రను తిరగరాసినా.. ఆ తర్వాత తడబడింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్ల్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), పంజాబ్ కింగ్స్(Punjab Kings)లపై భారీ తేడాతో జయభేరి మోగించింది. అయితే.. క్వాలిఫయర్ 1లో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో స్వల్ప స్కోర్కే పరిమితమై మ్యాచ్ చేజార్చుకుంది.
అనంతరం చెపాక్లో జరిగిన క్వాలిఫయర్ 2లో సన్రైజర్స్ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటింది. ఎలమినేటర్లో ఆర్సీబీపై విజయోత్సాహంతో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు చెక్ పెట్టి ఫైనల్కు దూసుకెళ్లింది. స్పిన్నర్లకు స్వర్గధామమైన చెపాక్ స్టేడియంలో మే 26 ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. దాంతో, కోల్కతా మూడో టైటిల్ అందుకుంటుందా? లేదా ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో రెండో ట్రోఫీ చేరుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.