Tirumala | తిరుమల వారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో జూన్ నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ విడుదల చేసింది. జూన్ నెలలో జేష్ఠ్యాభిషేకం, హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివరాలను టీటీడీ ప్రకటించింది. జూన్ ఒకటి నుంచి 5 వరకు తిరుమలలో ఆకాశగంగా, అంజనాద్రి, బాల ఆంజనేస్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 2న మహి జయంతి జరుపనున్నట్లు పేర్కొంది. జూన్ 19 నుంచి 21 వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు జరుగుతాయని చెప్పింది. 20న నాథమునుల వర్ష తిరు నక్షత్రం, 22న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు వివరించింది.