న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: మారుతి సుజుకీ మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ మృతిచెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 79 ఏండ్ల వయస్సు కలిగిన ఖట్టర్..దేశీయ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ముఖ్యంగా మారుతి సుజుకీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సుజుకీ మోటర్ కార్పొరేషన్ నుంచి మారుతి వేరు కావడంలో ఆయన పాత్ర కీలకం.