Reetinder Singh Sodhi : రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ రీతిందర్ సింగ్ సోధి అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో నవంబర్ 25వ తేదీన వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇండియా న్యూస్తో రీతిందర్ మాట్లాడాడు. వన్డే జట్టులో పంత్ ప్లేస్లో వికెట్ కీపర్, బ్యాటర్ అయిన శాంసన్ను ఆడించాలని అన్నాడు.
‘పంత్ టీ20 ఫార్మాట్లో జట్టుకు భారంగా మారుతున్నాడు. అతడి ప్లేస్లో సంజూ శాంసన్ను ఎంపికచేయడానికి ఇదే సరైన సమయం. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుంటే ఐసీసీ లాంటి టోర్నీల్లో ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. టీ 20 వరల్డ్ కప్లో పంత్ విఫలమయ్యాడు. కీలకమైన సెమీఫైనల్లో అతను 4 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యాడు. విఫలమవుతున్న ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తూ పోతే సమస్యలు తప్పవు. పంత్ సరిగ్గా ఆడకుంటే.. అతడిని జట్టు నుంచి తప్పించడమే మంచిది’ అని రీతిందర్ తెలిపాడు అన్నాడు. పంజాబ్కు చెందిన రీతిందర్ అండర్-15 వరల్డ్కప్ జట్టుకు కెప్టెన్గా, అండర్-19 వరల్డ్కప్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఆల్రౌండర్ 2000 డిసెబర్లో వన్డే టీమ్కు ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో పంత్ ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించాడు. సిడ్నీ టెస్ట్లో (97 పరుగులు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో, టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. అయితే, ఆసియా కప్లో, టీ 20 వరల్డ్కప్లో విఫలమయ్యాడు.