ముంబై: స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ సారథి రిషభ్ పంత్ ఐపీఎల్-17లో రెండోసారి జరిమానాను ఎదుర్కున్నాడు. ఇదివరకే చెన్నైతో మ్యాచ్లో పంత్పై ఫైన్ పడగా.. బుధవారం వైజాగ్ వేదికగా కోల్కతాతో మ్యాచ్లోనూ అదే తప్పు చేశాడు. నిర్దేశిత సమయంలో ఓవర్ల కోటాను పూర్తిచేయకపోవడంతో పంత్కు జరిమానా విధించినట్టు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పంత్ రూ.24 లక్షల ఫైన్ ఎదుర్కోగా..జట్టులోని మిగిలిన ఆటగాళ్లు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది.