షార్జా: ఆసియాకప్లో ఫైనల్ చేరాలనుకున్న టీమ్ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. ఆఖరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన సూపర్-4 పోరులో అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ విజయం సాధించడంతో.. రోహిత్ సేన అధికారికంగా ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో పాక్ ఒక వికెట్ తేడాతో అఫ్గాన్పై గెలుపొందింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇబ్రహీం (35) టాప్ స్కోరర్ కాగా.. పాక్ బౌలర్లలో రవుఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ (36), ఇఫ్తిఖార్ (30) రాణించారు. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో పాక్ పేసర్ నసీమ్ షా (14 నాటౌట్) వరుస బంతుల్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి జట్టును ఫైనల్కు చేర్చాడు. కీలక పోరులో ఓడినా అఫ్గాన్.. తన పోరాటంతో ఆకట్టుకుంది. షాదాబ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.