కరాచీ: సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన పాకిస్థాన్.. న్యూజిలాండ్తో పోరులో చక్కటి ప్రదర్శన కనబర్చింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సోమవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (161 బ్యాటింగ్; 16 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో కదం తొక్క గా.. నాలుగేండ్ల తర్వా త టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్ (86) ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్, బ్రాస్వెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.