ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాటర్ ఉసామా మీర్ ఒకే ఓవర్లో 34 రన్స్ కొట్టాడు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జరుగుతున్న ఘనీ రంజాన్ టోర్నీలో అతను చెలరేగిపోయాడు. జీఐసీ బ్యాటర్ అయిన ఉసామా మీర్.. కరాచీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో భారీ షాట్లతో అలరించాడు. ఓ ఓవర్లో అతను అయిదు సిక్స్లు, ఒక ఫోర్ బాదాడు. ఒక్కసారిగా జూలు విదిల్చిన ఉసామా మీర్.. పవర్ఫుల్ షాట్లతో అందర్నీ స్టన్ చేశడు. కేవలం 20 బంతుల్లో 66 రన్స్ చేశాడు.
రంజాన్ నెల సమయంలో పాక్లో ఘనీ టోర్నమెంట్ను రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తారు. ఘనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ జట్టు మీర్ హిట్టింగ్తో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 236 రన్స్ చేసింది.ఒకే ఓవర్లో అయిదు సిక్స్లు, ఒక ఫోర్ కొట్టిన మీర్ వీడియో ఇదే.
Usama mir on 🔥🔥🔥🔥
He scored 34 runs with 5 sixes and one 4 in an over….
What a bowler and what a clean hitter he is…
Usama mir the real future of Pakistan cricket 😍❤️🙌🙌🙌🙌
Vc: @geosupertv@iamusamamir#PakistanCricket #ramzancricket pic.twitter.com/mwcxtVvPcy— Qadir Khawaja (@iamqadirkhawaja) April 2, 2023