టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ జరుగుతున్న సెమీ ఫైనల్ 2 మ్యాచ్లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 176 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫిల్డింగ్ ఎంచుకోగా.. తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రిజ్వాన్, ఆజమ్.. పవర్ ప్లే వరకు రెచ్చిపోయారు. ఆ తర్వాత ఆజమ్ అవుట్ కావడంతో పాక్ స్కోర్ నెమ్మదించింది. రిజ్వాన్, జమాన్.. హాఫ్ సెంచరీ చేసి పాక్కు భారీ స్కోర్ అందించారు.
ఆఖరి ఓవర్లో జమాన్ రెచ్చిపోయాడు. రెండు సిక్సులు బాదాడు. 32 బంతుల్లో జమాన్.. 55 పరుగులు చేసి 3 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు చేసి 3 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. ఆజమ్ 34 బంతుల్లో 39 పరుగులు చేసి 5 ఫోర్లు బాదాడు. సోయబ్ మాలిక్.. కేవలం రెండే బంతులు ఆడి ఒక పరుగు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆసిఫ్ అలీ.. డక్ అవుట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. కమిన్స్, జంపా చెరో వికెట్ తీశారు. అయితే.. జంపా 4 ఓవర్లు వేసి కేవలం 22 పరుగులే ఇచ్చాడు.