ముంబై: అక్టోబర్లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్కప్( ICC ODI worldcup)కు చెందిన షెడ్యూల్ను ఇంకా రిలీజ్ చేయని విషయం తెలిసిందే. ఇటీవల ప్రతిపాదిత షెడ్యూల్ను రిలీజ్ చేసినా.. దాన్ని ఇంకా పూర్తిగా ఆమోదించలేదు. అయితే ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ అహ్మాదాబాద్లో జరగాల్సి ఉంది. కానీ ఆ వేదికపై ఆడేందుకు పాకిస్థాన్ సుముఖంగా లేదని తెలుస్తోంది.
వన్డే టోర్నమెంట్కు చెందిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఇటీవల ఐసీసీకి బీసీసీఐ ఇచ్చింది. కానీ షెడ్యూల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. ఆ షెడ్యూల్ ప్రకారం అహ్మాదాబాద్లో అక్టోబర్ 15వ తేదీన ఇండో పాక్ మ్యాచ్ ఉండనున్నది. పాక్ జట్టు తన మిగితా మ్యాచ్లను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కోల్కతా వేదికల్లో ఆడనున్నది. కానీ పాక్ విదేశాంగ శాఖ అహ్మాదాబాద్ మ్యాచ్కు ఓకే చెప్పలేదు. సెక్యూర్టీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
ఆటగాళ్లకు గ్యారెంట్ ఇవ్వాలని ఐసీసీని పీసీబీ కోరినట్లు ఓ మీడియా కథనం పేర్కొన్నది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత పాక్ బోర్డు ఆ షెడ్యూల్కు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ చైర్మెన్ గ్రెగ్ బార్క్లే, సీఈవో జెఫ్ అల్లార్డిస్ గత నెలలో లాహోర్లో సమీక్షకు వెళ్లినప్పుడు పీసీబీ ఈ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది.