సిడ్నీ: టీ20 వరల్డ్కప్ సెమీస్లో న్యూజిలాండ్ విసిరిన 153 పరుగుల లక్ష్యం దిశగా పాక్ ఈజీగా వెళ్తోంది. పవర్ప్లేలో పాక్ వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. ఓపెనర్లు రిజ్వాన్, బాబర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేస్తున్నారు. ప్రస్తుతం రిజ్వాన్ 28, బాబర్ 25 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. కివీస్ బౌలర్ల ఆశించిన రీతిలో బౌలింగ్ చేయడంలేదు.
A strong start from the Pakistan openers 👊#T20WorldCup | #NZvPAK | 📝: https://t.co/LSzHXLy12f pic.twitter.com/O533HIXA7U
— ICC (@ICC) November 9, 2022
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. డారెల్ మిచల్ టీ20ల్లో మూడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్తో 50 రన్స్ చేశాడతను. ఈ మ్యాచ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా.. అతను సింగిల్స్ తీస్తూ ఆచితూచి ఆడాడు.
నాలుగో వికెట్కు మిచెల్, విలియమ్సన్ 68 రన్స్ జోడించారు. నిజానికి ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లు ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు. ఫీల్డింగ్లోనూ పాక్ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. కివీస్ బ్యాటర్లలో మిచెల్ 53, కాన్వే 21, నీషమ్ 16 రన్స్ చేశారు.