సిడ్నీ: టీ20 వరల్డ్కప్లో ఇవాళ పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. పాకిస్థాన్కు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. సెమీస్కు వెళ్లాలంటే పాక్ ఈ మ్యాచ్లో నెగ్గి తీరాల్సిందే. లేదంటే ఆ జట్టుకు సెమీస్కు వెళ్లడం కష్టం అవుతుంది. సూపర్ 12 స్టేజ్లో ఇప్పటి వరకు సౌతాఫ్రికా ఒక్క ఓటమి కూడా ఎదుర్కొలేదు. ఈ మ్యాచ్ ఆ జట్టుకు కూడా కీలకం కానున్నది. గ్రూప్ 2లో దూకుడుమీదున్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో విజయాన్ని ఆశిస్తోంది. ఫకర్ జమాన్ బదులుగా పాక్ జట్టులోకి మహ్మద్ హరిస్ చేరాడు. ఇక సౌతాఫ్రికా జట్టుకు డేవిడ్ మిల్లర్ దూరం అయ్యాడు.
Pakistan have won the toss and opted to bat against South Africa in Sydney 🏏#T20WorldCup | #PAKvSA | 📝: https://t.co/3VVq7VAJLt pic.twitter.com/9tffcCQ8E2
— ICC (@ICC) November 3, 2022